Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎండిన పుదీనా ఆకుల చూర్ణంతో పళ్లు తోముకుంటే?

ఎండిన పుదీనా ఆకుల చూర్ణంతో పళ్లు తోముకుంటే?
, గురువారం, 6 మే 2021 (23:04 IST)
పుదీనా ఆకులు, నూనె, విత్తనాలు, ఇతర భాగాలు అనేక రకాల వ్యాధులకు నివారిణిగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య సలహాను అనుసరించి మాత్రమే పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై ఉపయోగించాలి.
 
తలనొప్పి: పుదీనా ఆకులు ముద్దగా చేసి నుదిటిపై వేయాలి. ఆకులు నలిపి వాసన చూడాలి. 
 
జుట్టు ఊడటం, పేలు: పుదీనా ఆకులు పేస్ట్‌ను రాత్రి తలకు పట్టించాలి. పొద్దుటే స్నానం చెయ్యాలి.
 
దగ్గు జలుబు: పుదీనా కషాయం రోజు 2 సార్లు తాగాలి.
 
గొంతునొప్పి: పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకుల పొడుముతో పళ్లు తోముకోవాలి.
 
దంతవ్యాధులు: పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతి రోజు ఆకులు బాగా ఎక్కువసేపు నమిలి తినాలి.
 
పిప్పి పళ్ళు: పిప్పరమెంట్ నూనెతో లవంగ నూనె కలపాలి. ఆ మిశ్రమంలో దూదిని తడిపి పెడితే పిప్పి పళ్ళు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. 
 
ముఖంపై మొటిమలు: పుదీనా నూనె మొటిమల పైన రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం తాగాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావిచెట్టు బెరడుతో శ్వాసకోశ సమస్యలకు చెక్