Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర తీసుకుంటున్నారా... జాగ్రత్త..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (15:43 IST)
పొద్దున్నే నిద్రలేవగానే తేనీరో లేదా కాఫీనో తీసుకుంటుంటారు. కొందరికి ఉప్మా మీద పంచదార చల్లుకుంటే గానీ తిన్నట్టుండదు. ఇంకొందరికైతే సాయంత్రమైందంటే చాలు.. బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. ఇలా చేప్పాలంటే కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తింటారు. చాలామంది వీటిని అంతగా గమనించరు. వీటిల్లో కంటి కనపించకుండా బోలెడంత చక్కెర దాక్కొని ఉంటుంది.
 
రక్తంలో గ్లూకోజ్ డొపమైన్ వంటి నాడి సమాచార వాహకాల హెచ్చుతగ్గులపై చక్కెర గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందువలన ఇది మితిమీరితే కుంగుబాటు వంటి మానసిక సమస్యల వచ్చే ప్రమాదాలున్నాయి. రోజుకు 67 గ్రాములు అంతకన్నా ఎక్కువ చక్కెర తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 23 శాతం ఎక్కువవుతున్నట్టు పరిశోధనలో తెలియజేశారు. 
 
తీపి పానీయాలు తీసుకున్నప్పుడు మూడ్, ఉత్సాహం పెరిగినట్టు అనిపిస్తుంది. వీటిల్లో ప్రోటీన్స్, పీచు వంటివేవీ లేకపోవడం వలన త్వరలోనే శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా ఉత్సాహం ఆవిరవుతుంది. అలానే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది. ఇతర రకాల చక్కెరలా కాకుండా ఫ్రక్టోజ్ పూర్తిగా కాలేయంలోనే జీర్ణమవుతుంది. 
 
ఇది గ్లైకోజెన్‌గా మారి అక్కడే స్థిరపడుతుంది. కాలేయం కొంతవరకు మాత్రమే గ్లైకోజెన్‌ను నిల్వ ఉంచుకోగలదు. మితిమిరీతే ఇదంతా కొవ్వుగా మారిపోతుంది. అందువలన చక్కెర ఎక్కువగా తీసుకోవడం మానేయండి. లేదా.. కాలేయంలో కొవ్వు పోగుపడే ప్రమాదముంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments