చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ
చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం.
* నిరంతరం ఏసీ గదుల్లో ఉండటం వల్ల సహజంగానే కళ్లు పొడిబారతాయి. కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురద, మంటపెడతాయి.
* గంటల కొద్దీ ఏసీలో ఉండేవారికి చర్మ పొడిబారిపోయి దురదపెడుతుంది. ఏసీ కింద ఉండి ఎండలోకి వెళితే చర్మం మరింతగా పొడిబారుతుంది. దీంతో చర్మ దురద సమస్య మరింతగా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
* ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది.
* పొద్దస్తమానం ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ముక్కు, గొంతు, కళ్లు ఇన్ఫెక్షన్కు గురవుతాయి.