Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

సిహెచ్
సోమవారం, 31 మార్చి 2025 (13:39 IST)
క్రెడిట్: ఫ్రీపిక్
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. 
 
ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది. ఎందుకంటే అలా మచ్చలు, పసుపు రంగులో వున్న కాయలపై ఈ ఫంగస్ పట్టుకుని వుంటుంది. మనం వాటిని కూరల్లో వేసుకున్నప్పుడు ఈ ఫంగస్ కాస్తా మన జీర్ణాశయానికి చేరుతుంది.
 
ఫలితంగా జీర్ణ సమస్యలతో పాటు కాలేయ కేన్సర్ వచ్చే ప్రమాదం వుందని చెబుతున్నారు. అదేవిధంగా వేరుశనక్కాయలు కొనుగోలు చేసేటపుడు కూడా జాగ్రత్త వహించాలి. నల్ల మచ్చలు, పసుపు మచ్చలతో వున్నటువంటి కాయల జోలికి వెళ్లకుండా వాటిని దూరం పెట్టాలి. ఐతే బాగా ఎండబెట్టడం, వేయించడం వంటి పద్ధతుల ద్వారా ఈ ఫంగస్ కాస్త తగ్గే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

తర్వాతి కథనం
Show comments