12 రాష్ట్రాలను చుట్టేస్తూ అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది..?

ప్రపంచంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థగా భారతీయ రైల్వేకు స్థానముంది. భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు దేశం నలుమూలల తిరుగుతూ కోట్లాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైలు బండ్లు వేల సంఖ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (15:51 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థగా భారతీయ రైల్వేకు స్థానముంది. భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు దేశం నలుమూలల తిరుగుతూ కోట్లాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైలు బండ్లు వేల సంఖ్యలో ఉన్నా... ఒకటి రెండు రైళ్ళ గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ రెండు రైలు బండ్లు మాత్రమే అత్యంత దూరం ప్రయాణిస్తుంటాయి. అలాంటి వాటిలో వివేక్ ఎక్స్‌ప్రెస్ ఒకటి కాగా, రెండోది హిమసాగర్ ఎక్స్‌ప్రెస్.
 
ఇది ఉత్తర అస్సోంలోని డిబ్రూగఢ్ - కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4233 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి, 55 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలును స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ రైలు లుథియానా, న్యూఢిల్లీ, భోపాల్, నాగపూర్, విజయవాడ, తిరుపతి, సేలం, కోయంబత్తూరు మొదలైన ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంటుంది. ఈ రైలు జర్నీ 80 గంటల 15 నిమిషాల పాటు సాగుతుంది. 
 
ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణిస్తుంది. మొత్తం 3709 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి చేరుకునేందుకు ఈ ట్రైన్‌కు మొత్తం 71 గంటల 50 నిముషాలు పడుతుంది. ఈ రైలు మొత్తంగా 67 రైల్వే స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఈ రెండు రైళ్లు మాత్రమే దేశంలో సుదూర దూర ప్రయాణించే రైళ్లు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

తర్వాతి కథనం
Show comments