Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథ యువతిపై వలంటీరు అత్యాచారం... గర్భందాల్చడంతో వెలుగులోకి..

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవలంటీర్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళపై వారు ఈ తరహా అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. తాజగా తల్లిదండ్రులు లేని అనాథ యువతిపై ఒక వలంటీర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఆ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రెంటికోట గ్రామంలో ఓ దళిత యువతి తల్లిదండ్రులు కొన్నినెలల క్రితం చనిపోయారు. పైగా, ఆమెకు తోడబుట్టినవారు, బంధువులు కూడా లేరు. ఉన్నవారు కూడా దగ్గరకు చేరదీయలేదు. దీంతో ఆమె మందస మండలంలో యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని వరండాల్లో పనుకునేది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన వలంటీరు కణితి బాలకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భందాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, వలంటీరును అరెస్టు చేయకుండా వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం