బ్రిటన్‌కు రైట్ రైట్... యూఏఈ పొడగించిన నిషేధం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:26 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉంది. ప్రతి రోజూ 3.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో భారత విమాన రాకపోకలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇలాంటి దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 
 
ఇక్కడ ప్రతిరోజూ నమోదయ్యే కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తుండటంతో ఏప్రిల్ 24 యూకేకు విమానాలను రద్దు చేశారు. అయితే మే 1 శనివారం నుంచి ఈ దేశానికి విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. 
 
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్‌రో విమానాశ్రయానికి ఈ విమానాలు ప్రయాణిస్తాయి. మే 1 నుంచి 15 వరకూ ఇలా పాక్షిక సేవలు అందించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
 
మరోవైపు, భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఇండియన్ ప్రయాణికులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. మే 14 వరకు భారత ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం లేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తెలిసింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం అందించింది. 
 
కాగా, ఇక ఈ నెల 24 నుంచి భారత విమానాల రాకపోకలపై యూఏఈ పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు భారత్ నుంచి యూఏఈ వచ్చే అన్నీ విమానాలను క్యాన్సిల్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments