Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు రైట్ రైట్... యూఏఈ పొడగించిన నిషేధం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:26 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉంది. ప్రతి రోజూ 3.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో భారత విమాన రాకపోకలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇలాంటి దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 
 
ఇక్కడ ప్రతిరోజూ నమోదయ్యే కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తుండటంతో ఏప్రిల్ 24 యూకేకు విమానాలను రద్దు చేశారు. అయితే మే 1 శనివారం నుంచి ఈ దేశానికి విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. 
 
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్‌రో విమానాశ్రయానికి ఈ విమానాలు ప్రయాణిస్తాయి. మే 1 నుంచి 15 వరకూ ఇలా పాక్షిక సేవలు అందించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
 
మరోవైపు, భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఇండియన్ ప్రయాణికులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. మే 14 వరకు భారత ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం లేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తెలిసింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం అందించింది. 
 
కాగా, ఇక ఈ నెల 24 నుంచి భారత విమానాల రాకపోకలపై యూఏఈ పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు భారత్ నుంచి యూఏఈ వచ్చే అన్నీ విమానాలను క్యాన్సిల్ చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments