Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు రైట్ రైట్... యూఏఈ పొడగించిన నిషేధం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:26 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉంది. ప్రతి రోజూ 3.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో భారత విమాన రాకపోకలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇలాంటి దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 
 
ఇక్కడ ప్రతిరోజూ నమోదయ్యే కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తుండటంతో ఏప్రిల్ 24 యూకేకు విమానాలను రద్దు చేశారు. అయితే మే 1 శనివారం నుంచి ఈ దేశానికి విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. 
 
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్‌రో విమానాశ్రయానికి ఈ విమానాలు ప్రయాణిస్తాయి. మే 1 నుంచి 15 వరకూ ఇలా పాక్షిక సేవలు అందించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
 
మరోవైపు, భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఇండియన్ ప్రయాణికులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. మే 14 వరకు భారత ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం లేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తెలిసింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం అందించింది. 
 
కాగా, ఇక ఈ నెల 24 నుంచి భారత విమానాల రాకపోకలపై యూఏఈ పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు భారత్ నుంచి యూఏఈ వచ్చే అన్నీ విమానాలను క్యాన్సిల్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments