Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగ్గుబియ్యం వడలు.. పిల్లలు లొట్టలేస్తూ తింటారు...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (17:21 IST)
పండుగ వచ్చిందంటే ఇంట్లోనే రకరకాల పిండి వంటలు, తినుబండారాలు తయారుచేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడూ చేసే వంటలే కాకుండా అప్పుడప్పుడు మార్చి మార్చి కొత్త వంటలు చేయడం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసిన వెరైటీస్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. కనుక ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
 
కావలసిన పదార్ధాలు..
సగ్గుబియ్యం-పావుకిలో
బంగాళదుంపలు- 3
పచ్చిమిర్చి-6
ఉప్పు- తగినంత
జీలకర్ర- టీ స్పూన్
కొత్తిమీర తురుము- కొద్దిగా
నూనె- వేయించడానికి సరిపడా
బియ్యంపిండి-2 టీ స్పూన్లు
వంటసోడా- చిటికెడు
 
తయారుచేసే విధానం...
సగ్గుబియ్యం ఓ గంట ముందే నానబెట్టాలి. తరువాత బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో సగ్గుబియ్యం, చిదిమిన ఆలూ, జీలకర్ర, పచ్చిమిర్చితురుము,ఉప్పు, బియ్యంపిండి, వంటసోడా, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ప్లాస్టిక్ కాగితం మీద నూనె రాసుకుంటూ వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments