ముందుగా పాస్తాను నీటిలో ఉడికించి నీరంతా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్, వేసి సన్నని మంటపై ఉడికించుకోవాలి. ఆ తరువాత ఉప్పు, బిర్యానీ పొడి, పుదీనా, కొత్తిమీర వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉడికించిన పాస్తా వేసి కాసేపు వేయించి తీసుకుంటే టేస్టీ టేస్టీ పాస్తా బిర్యానీ రెడీ.