Webdunia - Bharat's app for daily news and videos

Install App

341 రోజులు... 3,648 కి.మీ... నేటితో జగన్ పాదయాత్ర సమాప్తం...(Video)

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (10:21 IST)
‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయి’ అంటూ వైకాపా కార్యకర్తల నినాదాల హోరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల మీదుగా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 2017 నవంబరు 6న ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన ఆయన జిల్లా కేంద్రాల నుంచి మారుమూల పల్లెల వరకూ సాగించారు. అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా చూశారు. వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వచ్చేది మన ప్రభుత్వమేననీ, నేను ముఖ్యమంత్రినయ్యాక అన్ని సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. 
 
కాగా ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు నెలల వ్యవధి వుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 341 రోజుల పాటు 3,648 కి.మీ మేర జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సాగింది. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మరి ఈ స్పందన ఓట్ల రూపంలో జగన్ మోహన్ రెడ్డికి ఏ మేరకు లబ్ది చేకూరుతుందన్నది వేచి చూడాలి.
 
మరోవైపు జగన్ పాదయాత్ర ముగింపు సభను ఈ రోజు ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇచ్ఛాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర విజయ స్తూపాన్ని ఆయన ఆవిష్కరించిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. చూడండి వైఎస్ జగన్ పాదయాత్ర ముగించే ప్రదేశంలో పైలాన్.. ఏరియల్ వ్యూ... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments