రాజా రామ్ మోహన్ రాయ్ జయంతి-బాల్యవివాహాలు, సతీసహగమనంకు గండికొట్టారు..

Webdunia
సోమవారం, 22 మే 2023 (13:01 IST)
Raja Ram Mohan Roy
మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రాజా రామ్మోహన్ రాయ్ పుట్టినరోజు నేడు. 1772 సంవత్సరం మే 22న బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాధనగర్ హూగ్లీలో వైష్ణవ కుటుంబంలో రామ్మోహన్ రాయ్ జన్మించారు.
 
రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, బెంగాలీ, అరబిక్, పర్షియన్ భాషల్లో నిపుణులు. దేశంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయడంలో విజయవంతం అయ్యారు. 1828లో ఈయన బ్రహ్మ సమాజ్‌ను స్థాపించారు. 
 
వితంతు పునర్వివాహాలు జరిపించడంతోపాటు స్త్రీ విద్య కోసం ఆయన విశేష కృషి చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగం పొందడంతోపాటు ఆ భాష వల్ల శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని భావించారు. అందుకే మనదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. 
 
మెఘల్ చక్రవర్తి తరఫున రాయబారిగా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్లారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందే మొఘల్ చక్రవర్తి ఆయనకు "రాజా" బిరుదునిచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉండగానే మెదడువాపు వ్యాధితో 1833 సెప్టెంబర్ 27న బ్రిస్టల్ నగరంలో రాయ్ మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments