Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశినేని నాని పార్టీ మారడం ఖాయం? కానీ మెలిక పెట్టిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (15:21 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అందుకే సొంత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇవి టీడీపీ శ్రేణులకు తలనొప్పిగా మారాయి. 
 
గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకునిపోయింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకుగాను కేవలం 22 మంది మాత్రమే గెలుపొందగా, ముగ్గురు ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. వారిలో ఒకరు కేశినేని నాని. ప్రస్తుతం విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 
 
అయితే, ఆయన పార్టీ మారబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా, బీజేపీలో చేరబోతున్నట్టు వదంతులు వచ్చాయి. వీటిని నాని తోసిపుచ్చారు. కానీ, టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు (ఆంధ్రప్రదేశ్ నుంచి) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేశినేని నాని బీజేపీ వైపు కాకుండా వైకాపా వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మరో పదేళ్ళ పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. పైగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు తన వ్యాపారాలకు ఎలాంటి ఢోకా ఉండదన్న భావన ఉంది. అలాగే, బీజేపీ నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో కేంద్రంలో కూడా తనకు కావాల్సిన పనులను చక్కబెట్టుకోవచ్చన్నది కేశినేని భావనగా ఉంది. అందుకే ఆయన వరుస ట్వీట్లతో కలకలం సృష్టిస్తున్నారు. 
 
అదేసమయంలో కేశినేని వైకాపాలో చేరేందుకు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమ్మతించినప్పటికీ.. ఓ మెలిక పెట్టారట. ఇతర పార్టీలకు చెందిన నేతలు తమ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా తాము ఉంటున్న పార్టీలతో పాటు తాము వహిస్తున్న పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ విస్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో కేశినేని నాని పార్టీ మారే విషయంపై వెనుకంజ వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments