Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాములమ్మ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టేనా?

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (14:57 IST)
లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి రాజకీయాలకు ప్యాకప్ చెప్పాలని ఆలోచిస్తున్నారా? పూర్తి సమయం సినిమాలకే కేటాయించాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం రాబోతుంది. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ పార్టీ  తరపున తెలంగాణ అంతటా ప్రచారం చేసినా, కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ప్రకటనలు విడుదల చేయడం తప్ప పెద్దగా క్రీయాశీల రాజకీయాల్లో కనిపించడంలేదు.
 
అదే సమయంలో సినిమాలో సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకమైన రోల్ షోపించారు. అంతేకాదు  మరికొన్ని సినిమాలకు సైతం విజయశాంతి సైన్ చేశారన్న వార్తలే రాములమ్మ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టుగా కనపడుతుందన్న భావనను వ్యక్తం చేస్తున్నాయి పొలిటికల్ వర్గాలు. 
 
విజయశాంతి పొలిటికల్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. భారతీయ జనతా పార్టీ ఫైర్‌ బ్రాండ్‌‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ తరువాత మెదక్  పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత కేసీఆర్‌తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా టీఆర్ఎస్‌కు సైతం గుడ్‌ బై చెప్పి, కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇప్పుడామె కాంగ్రెస్‌లోనే ఉన్నా, క్రియాశీలకంగా మాత్రం లేరు. 
 
కాంగ్రెస్‌లో సీనియర్లు తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని అసంతృప్తిగా ఉన్న రాములమ్మను సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బిజేపి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని విజయశాంతి చాలాసార్లు ఖండించారు. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఆమె సినిమాలను ఒప్పుకున్నారని, త్వరలో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారని  పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు అంటున్నా, విజయశాంతి మనస్తత్వం తెలిసిన నేతలు ఆమె రాజకీయాల్లో ఇమడలేరని అందుకే మరలా సినిమాలు వైపు వస్తున్నారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments