Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం సరే... నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రం భద్రత ఏంటి?

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (09:46 IST)
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవర్ ప్యానెల్‌లో చెలరేగిన మంటలతో ఈ పెను విపత్తు సంభవించింది. ఫలితంగా 900 మెగావాట్లల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంట్ మొత్తం దగ్ధమైపోయింది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ షార్ట్‌సర్క్యూట్‌ కాగా, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 
 
శ్రీశైలం తరహా ప్రమాదమే నాగార్జునసాగర్‌ కేంద్రంలో జరిగితే ఆస్తి నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో, 2018 ఫిబ్రవరిలో షార్ట్‌ సర్క్యూట్‌తో టర్బైన్‌ కాలిపోయింది. 2014 ఓ టర్బైన్‌ పూర్తిగా కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. 
 
ఈ ప్లాంట్‌లో ప్రతి షిఫ్టులో డీఈ, ఏడీఈ, నలుగురు ఏఈలు, మరో నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అనుకోని ప్రమాదం సంభవిస్తే.. ఉద్యోగులు తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేయాలి. అంబులెన్స్‌ ఉండాలి. ఇవేమీ లేకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments