Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు కుబేరులు ఎవరు? టాప్-10 కుబేరులు వీరే

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (10:11 IST)
దేశంలో కుబేరుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులు అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా వెయ్యి కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్న ఐఐఎఫ్ఎల్ వెల్త్ వెల్లడించింది. వీరి మొత్తం విలు రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్టు తెలిపింది. ఇందులో రూ.56200 కోట్ల ఆస్తులతో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి కె.దివి మొదటి స్థానంలో ఉన్నారు. 
 
ఈ తెలుగు కుబేరుల ఆస్తి విలువ గత యేడాదితో పోల్చితే వీరి ఆస్తి విలువ 3 శాతం పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆహార ప్రాసెసింగ్‌, నిర్మాణ రంగాల వారూ ఉన్నారు. 
 
హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారధి రెడ్డి, ఆయన కుటుంబం రూ.39,200 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రూ.8,700 కోట్ల విలువైన ఆస్తులతో మహిమా దాట్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని సంపన్నుల్లో 64 మంది (82 శాతం) భాగ్య నగరికి చెందినవారే కావడం గమనార్హం. 
 
అలాగే, విశాఖపట్నం నుంచి ఐదుగురు, రంగారెడ్డి నుంచి ముగ్గురు ఉన్నారు. ఈసారి ఏపీ, తెలంగాణల నుంచి కొత్తగా 11 మంది జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు సంస్థ తెలిపింది. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కుబేరుల్లో తొలి 10 మంది వివరాలను పరిశీలిస్తే, మురళి కె.దివ (దివిస్ లేబొరేటరీస్) సంపద విలువ రూ.56,200 కోట్లు, బి.పార్థసారథి కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రూ.39,200 కోట్లు, ఎం. సత్యనారాయణ రెడ్డి, కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబ్స్) రూ.16,000 కోట్లు, జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్) రూ.15,000, కోట్లు, రామేశ్వర రావు జూపల్లి, కుటుంబం (మై హోం ఇండస్ట్రీస్) రూ.13,300 కోట్లు, పి.పిచ్చరెడ్డి (మేఘా ఇంజనీరింగ్) రూ.12,600 కోట్లు, పీవీ కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్) రూ.12,100 కోట్లు, కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్) రూ.11,300 కోట్లు, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం (సువెన్ ఫార్మా) రూ.9,000 కోట్లు, మహిమా దాట్ల, కుటుంబం (బయోలాజికల్ ఇండియా లిమిటెడ్) రూ.8,700 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments