అమరావతిపై జరుగుతున్న రచ్చ... టీడీపీ కీలక నేత ఏమైయ్యాడు..?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (18:00 IST)
అమరావతిపై ఏపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో అందరి కళ్లు ఆ నేత వైపే ఉన్నాయి. రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలతో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది.

కాగా రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెలువరించిన వెంటనే తమ కార్యాచరణ రూపొందించాలని భావిస్తోంది.
 
రాజధానిపై ఇంత రగడ జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ మాజీమంత్రి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఆయనే టీడీపీకి చెందిన మాజీమంత్రి నారాయణ. గతంలో నారాయణ ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
 
గతంలో రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీని కాదని నారాయణ కమిటీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అనేక సార్లు ఎద్దేవా చేశారు. ఈ విషయంపై మాజీమంత్రి నారాయణ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 
 
టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం విషయంలో ప్రముఖ పాత్ర పోషించిన నారాయణ ప్రస్తుతం మౌనం వహిస్తుండడం ఏమిటో టీడీపీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ రాజధాని విషయమై తాను స్పందిస్తే, పాలక పక్షానికి ప్రత్యేకంగా టార్గెట్‌గా మారుతానని నారాయణ భావిస్తుండవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే ఆయన మౌనంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఏపీ నూతన రాజధాని అమరావతిపై మాజీమంత్రి నారాయణ స్పందన ఎలా ఉంటుందో సస్పెన్స్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మూవీ

Raghu Kunche: గేదెల రాజు క్యారెక్టర్ భయపెట్టేలా ఉండేందుకు 12 కేజీల పెరిగాను : రఘు కుంచె

Vijay Sethupathi: పూరి జగన్నాథ్- స్లమ్ డాగ్ స్పెషల్ ఫిల్మ్ గా గుర్తుండిపోతుంది : విజయ్ సేతుపతి

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

అక్షయ తృతీయ ప్రచారంతో కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇంద్రియ

హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ది లీలా మొజాయిక్ 2026కి విశేష స్పందన

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

తర్వాతి కథనం
Show comments