Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా సెకండ్ వేవ్: కరోనాతో 24 గంటల్లో 770 మంది మృతి

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (09:33 IST)
భారత్‌లో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్‌ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్‌ దాటడమే కాకుండా.. లక్ష 50వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా లక్ష 45వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని పాజిటివ్ కేసులు ఎప్పుడూ రికార్డు కాలేదు. కరోనాతో 24 గంటల్లో 770 మందికిపైగా చనిపోయారు.
 
అటు యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలో ఇప్పటి వరకు నమోదుకాని యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలు 46 వేలు దాటేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 10 లక్షల 26 వేల యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసింది సెకండ్‌వేవ్‌.
 
కరోనా ఉగ్రరూపానికి మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఢిల్లీ అల్లాడిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 వేలకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు ఉత్తర్‌ ప్రదేశ్‌లో దాదాపు 10 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. మరోవైపు ఢిల్లీలో కరోనా కోరలు విప్పింది. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గతేడాది నవంబర్‌ 11 తర్వాత ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments