యూపీ కోటాలో రాజ్యసభకు చిరంజీవి.. బీజేపీ ప్లాన్?

సెల్వి
బుధవారం, 31 జనవరి 2024 (13:12 IST)
రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఒక్క యూపీలోనే 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం చిరంజీవిని కూడా యూపీ కోటాలోనే రాజ్యసభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి ఎంతవరకు అంగీకరిస్తారనేది తెలియాల్సి వుంది. 
 
యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల కోసం పదేళ్ల పాటు సినిమాలకు దూరమైన చిరంజీవి.. మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాజకీయాల్లోకి ఆయన వెళ్తారా అనేది చర్చనీయాంశమే. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments