Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైల్ : డీపీఆర్‌కు ఆహ్వానం

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:25 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై - భాగ్యనగరం హైదరాబాద్‌ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య మొత్తం 711 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో బుల్లెట్ రైల్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్) కోసం బిడ్లను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా, నవంబరు 5వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. 
 
ఈ సమావేశంలో బుల్లెట్ కారిడార్ మార్గానికి సంబంధించిన సమగ్ర సర్వే, ఉపరితల మార్గం, భూగర్భ మార్గం, సబ్‌స్టేషన్లు తదితర మార్గాలపై చర్చించనున్నారు. తద్వారా ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొదించనున్నట్టు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి సుష్మా గౌర్ వివరాలను వెల్లడించారు. ఈ కారిడార్‌కు సంబంధించి నవంబరు 18వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. విజయవంతమైన బిడ్డరుకు టెండర్ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. 
 
ఇటీవలే మరో ఏడు కారిడార్లలోనూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డీపీఆర్‌లను ఆహ్వానించింది. ఇందులో ఢిల్లీ టు అమృతసర్, అమృతసర్ టు చంఢీఘర్, ఢిల్లీ టు వారణాసి, ముంబై టు నాగ్‌పూర్, ఢిల్లీ టు అహ్మదాబాద్ కారిడార్లు ఉన్నాయి. వీటితో పాటే ముంబై టు పూణె, పూణె టు హైదరాబాద్ కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది. చెన్నై టు మైసూర్, వారణాసి టు హౌరా మార్గాలకు ఇంకా టెండర్లు పిలవాల్సివుంది. 
 
ఈ బుల్లెట్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం, దూరం మరింత తగ్గుతుంది. తద్వారా వ్యాపార, వాణిజ్య రంగాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. 2028 నాటికి దేశంలో బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. తద్వారా రైల్వే రూపు రేఖలు మారిపోతాయని విశ్వసిస్తోంది. 
 
ప్రస్తుతం అహ్మదాబాద్ - ముంబై బుల్లెట్ రైల్ కారిడార్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 500 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోనుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments