సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

ఠాగూర్
ఆదివారం, 19 అక్టోబరు 2025 (11:06 IST)
సంత్రాగచ్చి - చర్లపల్లి ప్రాంతాల మధ్య నడిచి ప్రత్యేక రైలులో వచ్చిన ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఐదు రోజుల క్రితం ఈ దారుణం జరిగితే ఆలస్యంగా వచ్చింది. పోలీసులు దర్యాప్తులో వెల్లడైన కథనాల మేరరకు.. ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై అత్యాచారం జరిగినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఇందులో అత్యాచారం అనంతరం నిందితుడు రాజారావు పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో అక్కడ దిగిపోయి పత్తిచేల మీదుగా నడుచుకుంటూ వెళ్లి సత్తెనపల్లి బస్సెక్కాడు. బాధితురాలి నుంచి గుంజుకున్న సెల్‌ఫోను అక్కడ విక్రయించి వచ్చిన డబ్బుతో బిర్యానీ తిన్నాడు. అనంతరం అక్కడే రైలెక్కి గుంటూరు వచ్చి నగర వీధుల్లో రెండుగంటలపాటు చక్కర్లు కొట్టాడు. 
 
తర్వాత మరో రైలెక్కి తెనాలిలో దిగాడు. బాధితురాలి సిమ్ కార్డును తన ఫోనులో వాడడంతో టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. గత మూడు రోజుల విచారణలో నిందితుడు అనేక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఎనిమిది నెలల క్రితం కేరళకు చెందిన ఓ మహిళపైనా అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆది, సోమవారాలు సెలవు కావడంతో నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments