Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 తులాల బంగారు నగల కోసం మహిళను చంపి .. శవాన్ని డ్రమ్ములో కుక్కేశారు...

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (21:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన కిరాతకులు శవాన్ని ఓ డ్రమ్ములో కుక్కేశారు. ఈ దారుణం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన నర్సవ్వ అనే మహిళ తన భర్తతో కలిసి జీవిస్తూ సిమెంట్ పనులకు వెళుతూ జీవనం సాగిస్తూ వస్తుంది. ఈ క్రమంలో శనివారం నాడు కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు నర్సవ్వ వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. దీనిపై భర్త కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా, స్థానికంగా ఉండే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నర్సవ్వను ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. నర్సవ్వ వద్ద ఉండే బంగారు నగల కోసం సిమెంట్ పనులు చేయించే మేస్త్రీతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ హత్య చేయించినట్టు తేలింది. 
 
హత్య చేసిన తర్వాత 4 తులాల బంగారం, 10 తులాల వెండిని దోచుకుని, శవాన్ని డ్రమ్ములో కుక్కి.. దాన్ని గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి చెరువులో పడేశారు. వారు కదలికలన్నీ సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. దీనిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments