Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లాత్‌ను కడుపులో పెట్టి కుట్టేశారు.. ఏడాది తర్వాత ఏం జరిగిందంటే?

Advertiesment
Jagtial
, మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (18:27 IST)
మహిళకు డెలివరీ ఆపరేషన్ చేస్తూ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు క్లాత్‌ను కడుపులో పెట్టి మరిచిపోయారు.  డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై ఇంటికి పంపారు. 
 
కానీ కడుపులో నొప్పిని తాళలేక ఆ మహిళ నానా తంటాలు పడింది. ఏడాది గడిచినా కడుపులో నొప్పి తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. ఆమె కడుపులో ఓ క్లాత్ మరిచిపోయి కుట్లు వేశారని స్కానింగ్‌లో తేలింది. 
 
దీంతో బాధితురాలు జగిత్యాల జిల్లాకు చెందిన నవ్యకు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి క్లాత్‌ను బయటకు తీశారు. క్లాత్ ను నవ్య కడుపులో మరిచిపోయారంటే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారోనని జనం విమర్శిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వలింగ వివాహాలపై కేంద్రం వైఖరి ఏంటో తెలుసా?