Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (12:38 IST)
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా వదిలిపెడుతుంటారు. ఇలాంటి వారు తమకు తెలియకుండానే ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఏడేళ్ల బాలుడు వాటర్ వరల్డ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణంలో జరిగింది. 
 
నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆవరణలోని వాటర్ వరల్డ్‌లో రిషి (7) అనే ఏడేళ్ళ బాలుడు దిగడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు గుట్టుచప్పుడుకాకుండా ఆ బాలుడుని ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి వచ్చేలోపు రిషి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 
అయితే, మృతుడు తల్లిదండ్రులు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. వాటర్ వరల్డ్‌లో తమ బిడ్డపడి మరణించాడని, దీనిని కప్పిపుచ్చేందుకు నిర్వాహకులు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... పోస్టుమార్టం కోసం రిషి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరుక కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments