Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (12:38 IST)
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా వదిలిపెడుతుంటారు. ఇలాంటి వారు తమకు తెలియకుండానే ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఏడేళ్ల బాలుడు వాటర్ వరల్డ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణంలో జరిగింది. 
 
నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆవరణలోని వాటర్ వరల్డ్‌లో రిషి (7) అనే ఏడేళ్ళ బాలుడు దిగడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు గుట్టుచప్పుడుకాకుండా ఆ బాలుడుని ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి వచ్చేలోపు రిషి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 
అయితే, మృతుడు తల్లిదండ్రులు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. వాటర్ వరల్డ్‌లో తమ బిడ్డపడి మరణించాడని, దీనిని కప్పిపుచ్చేందుకు నిర్వాహకులు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... పోస్టుమార్టం కోసం రిషి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరుక కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments