వైజాగ్‌లో ఈవెనింగ్ వాకింగ్‌కు వెళ్లిన మహిళ దారుణ హత్య

ఠాగూర్
గురువారం, 16 అక్టోబరు 2025 (09:25 IST)
విశాఖపట్టణంలో ఓ వివాహిత దారుణ హత్యకుగురైంది. ఈవెనింగ్ వాక్‌కు వెళ్లిన ఆ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. విశాఖ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. శ్రావణ సంధ్య (30) అనే వివాహిత భర్తతో గొడవలు కారణంగా పిల్లలతో కలిసి వేరుగా అక్కయ్యపాలెం చెక్కుడురాయి ప్రాంతంలో నివాసం ఉంటోంది. 
 
ఆమెకు ఇద్దరు కుమారులు. ఒకరిని వసతి గృహంలో ఉంచి చదివిస్తుండగా మరొక కుమారుడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తన దగ్గరే ఉంచుకుంటూ పెంచుతోంది. బంధువుల ఆర్థిక సహాయం, కుమారునికి వచ్చే పింఛను మీదే జీవనం సాగిస్తోంది. తన ఇంటికి సమీపంలో ఉండే శ్రీనివాస్(47) కార్పెంటర్ వృత్తి చేస్తుంటాడు. శ్రీను ఈమెతో గతంలో తరచూ గొడవ పడుతుండేవాడు. 
 
ఇటీవల ఆమెను తిట్టడంతో గట్టిగా మందలించింది. అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్న శ్రీను బుధవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి వాకింగ్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చిన సంధ్యను వెనుక నుంచి కత్తితో పీక కోసి పరారయ్యాడు. 
 
తీవ్రరక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ ఉమాకాంత్, ఎస్ఐ వెంకట రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే గాలింపు చేపట్టి రైల్వేస్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments