Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధిస్తున్న కుమారుడిని హతమార్చిన తల్లి... ఎక్కడ?

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (13:39 IST)
దారితప్పిన ఓ కుమారుడిని కన్నతల్లి హతమార్చింది. అతను పెట్టే వేధింపులను భరించలేని ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడింది. ఆ హత్యకు ఆ తల్లి కుమార్తె (మృతుడి చెల్లి) కూడా సహకరించింది. ఈ దారుణం విజయవాడ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడకు చెందిన ఓ యువకుడు గంజాయి సేవనంతో పాటు ఇతర చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిత్యం ఇంటికి వచ్చి తల్లిని వేధింపులకు గురిచేయసాగాడు మద్యం, గంజాయి బానిసగా మారి డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించసాగాడు. ఈ వేధింపులు నానాటికీ పెరిగిపోతుండటంతో కన్నకొడుకు అనే విషయాన్ని కూడా ఆ వేధింపులు మర్చిపోయేలా చేశాయి. 
 
కాళిక మాతగా మారిన ఆ తల్లి కన్నబిడ్డను చంపేసింది. ఈ ఘటనకు మృతుడి చెల్లి కూడా సహకరించింది. అయితే, ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి పేరు దేవ్ కుమార్. హత్య చేసిన తల్లి పేరు మాధవి. వీరికి అలీఖాన్ అనే మరో వ్యక్తి కూడా సహకరించారు. పీకనొక్కి శ్వాస ఆడకుండా చేసి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. 
 
తాము పనికి వెళ్ళి వచ్చేసరికి చనిపోయివున్నాడంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత అనుమానాస్పదంగా కేసు నమోదు చేసిన పోలీసులు... పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య కేసుగా నమోదు చేసి మృతుడి తల్లి, చెల్లి, సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments