Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న చనిపోయాడని వదినను పెళ్లాడిన యువకుడి హత్య.. ఎక్కడ?

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (09:23 IST)
ఉత్తప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. అన్న చనిపోయిన తర్వాత విధవగా మారిన తన వదినను వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ చర్య ఆ కుటుంబంలోని ఇతర సోదరులకు ఏమాత్రం నచ్చకోపవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తికి సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్ వీర్, యశ్‌వీర్ అనే నలుగురు కునమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడైన సుఖ్‌వీర్ గత యేడాది చనిపోయాడు. ఈ క్రమంలో అతని భార్య.. సోదరుల్లో అందరికంటే చిన్నవాడైన యశ్‌వీర్‌ను పెళ్లి చేసుకుంది. ఇది మిగిలిన ఇద్దరు సోదరులకు ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచిం వారి కుటుంబంలో తరచుగా గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
అయితే, ఇవేమీ పట్టించుకోని యశ్‌వీర్ తాను మాత్రం తన విధుల్లో నిమగ్నమైపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసే యశ్‌వీర్.. శుక్రవారం రాత్రి తన విధులను ముగించుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మిగిలిన ఇద్దరు సోదరులు.. తమ తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్ రాకతో ఈ వివాదం మరింతగా ముదిరింది. దీంతో విచక్షణ కోల్పోయిన ఇద్దరు సోదరులు.. తమ్ముడు అని కూడా చూడకుండా యశ్‌వీర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులకు పాల్పడిన ఓంవీర్, ఉదయ్ వీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments