Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (18:23 IST)
గత 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన టెక్కీ ప్రభా అరుణ్ కుమార్(41) హత్య కేసులో హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5.75 కోట్ల రివార్డు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బెంగుళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్‌ను గత 2015 మార్చి 7వ తేదీన గొంతులో కత్తితో పొడిచి దండగులు హత్య చేశారు. హత్య జరిగి సుమారుగా పదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు హంతకుడి ఆచూకీని గుర్తించలేకపోతున్నారు. దీంతో హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్ల అంటే మన దేశ కరెన్సీలో రూ.5.75 కోట్లు ఇస్తామని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వం ప్రకటించింది. 
 
బెంగుళూరులోని మైండ్ ట్రీ కంపెనీలో పనిచేస్తూ వచ్చిన ప్రభ విధి నిర్వహణలో భాగంగా సిడ్నీకి వెళ్ళారు. అక్కడ విధులు ముగించుకుని బెంగుళూరులో ఉన్న తన భర్తతో ఫోనులో మాట్లాడుతూ, ఇంటికి నడిచి వస్తున్న సమయంలో ఆమె ఉండే ఇంటికి 300 మీటర్ల దూరంలో హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారు. ఎందుకు హత్య చేశారన్న విషయాన్ని ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు హంతకుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments