Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ ట్రైను ఏసీ బోగీలో మహిళపై టీటీఈ అత్యాచారం...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఏసీ బోగీలో ట్రావెలింగ్ టిక్కెట్ కలెక్టర్ (టీటీఈ) మరో వ్యక్తితో కలిసి ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి టీటీఈని గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో జరిగింది. 
 
చందౌసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేబీ సింగ్ వెల్లడించిన వివరాల మేరకు.. సుబేదార్ గంజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం వేచిచూస్తున్న ఓ మహిళ (33)ను చూసిన టీటీఈ ఏసీ బోగీలోని తన సీటులో కూర్చోవాల్సిందిగా కోరాడు. దీంతో ఆ మహిళ ఆ బోగీలో ఎక్కి కూర్చొంది. కొంతసమయం తర్వాత మరో వ్యక్తితో కలిసి అక్కడకు వచ్చిన టీటీఈ.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై శనివారం బాధితురాలు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు... టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు కేబీసింగ్ వెల్లడించారు. అతనితో కలిసి అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, బాధితురాలు నిందితుడు టీటీఈ రాజు సింగ్‌కు తెలిసిన మహిళ కావడం గమనార్హం. ఈ దారుణం ఈ నెల 16వ తేదీన రాత్రి పది గంటల సమయంలో చందౌనసి అలీఘర్ స్టేషన్ల మధ్య జరిగింది. బాధితురాలు చందౌసి నుంచి ప్రయాగ్ రాజ్ సుబేదార్‌గంజ్‌కు వెళుతుండగా అత్యాచారానికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments