టూర్‌కు తీసుకెళ్లిన విద్యార్థినికి మత్తుమందిచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:14 IST)
ఇటీవలికాలంలో అత్యాచారాలకు గురయ్యే విద్యార్థినిల సంఖ్య పెరుగుతోంది. తమ ప్రేమికులతో పాటు పోకిరీలు, కామాంధుల చేతుల్లో వారు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారు. అయితే, తమ వద్దకు వచ్చే విద్యార్థినిలను భావి పౌరులుగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులు కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ విద్యార్థిని మత్తుమందు ఇచ్చిన ఓ ప్రిన్సిపాల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగు చూసింది. కొందరు విద్యార్థినిలను టూర్ కోసం తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీరట్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గత నెల 23వ తేదీన 9 మంది విద్యార్థినిలను విహారయాత్ర పేరుతో బృందావన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి బస కోసం ఓ హోటల్‌లో రెండు రూమ్‌లు అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మందిని ఓ గదిలో ఉంచగా, 11వ తరగతి చదివే ఓ విద్యార్థినిని మాత్రం తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. బాలికి మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అయితే, ఆ బాలిక ప్రతిఘటించడంతో చంపేస్తానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. టూర్ ముగించుకుని గత 24వ తేదీన ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments