Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూర్‌కు తీసుకెళ్లిన విద్యార్థినికి మత్తుమందిచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:14 IST)
ఇటీవలికాలంలో అత్యాచారాలకు గురయ్యే విద్యార్థినిల సంఖ్య పెరుగుతోంది. తమ ప్రేమికులతో పాటు పోకిరీలు, కామాంధుల చేతుల్లో వారు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారు. అయితే, తమ వద్దకు వచ్చే విద్యార్థినిలను భావి పౌరులుగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులు కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ విద్యార్థిని మత్తుమందు ఇచ్చిన ఓ ప్రిన్సిపాల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగు చూసింది. కొందరు విద్యార్థినిలను టూర్ కోసం తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీరట్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గత నెల 23వ తేదీన 9 మంది విద్యార్థినిలను విహారయాత్ర పేరుతో బృందావన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి బస కోసం ఓ హోటల్‌లో రెండు రూమ్‌లు అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మందిని ఓ గదిలో ఉంచగా, 11వ తరగతి చదివే ఓ విద్యార్థినిని మాత్రం తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. బాలికి మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అయితే, ఆ బాలిక ప్రతిఘటించడంతో చంపేస్తానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. టూర్ ముగించుకుని గత 24వ తేదీన ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments