Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూర్‌కు తీసుకెళ్లిన విద్యార్థినికి మత్తుమందిచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం

టూర్‌కు తీసుకెళ్లిన విద్యార్థినికి మత్తుమందిచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం
Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:14 IST)
ఇటీవలికాలంలో అత్యాచారాలకు గురయ్యే విద్యార్థినిల సంఖ్య పెరుగుతోంది. తమ ప్రేమికులతో పాటు పోకిరీలు, కామాంధుల చేతుల్లో వారు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారు. అయితే, తమ వద్దకు వచ్చే విద్యార్థినిలను భావి పౌరులుగా తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులు కూడా ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ విద్యార్థిని మత్తుమందు ఇచ్చిన ఓ ప్రిన్సిపాల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగు చూసింది. కొందరు విద్యార్థినిలను టూర్ కోసం తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీరట్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గత నెల 23వ తేదీన 9 మంది విద్యార్థినిలను విహారయాత్ర పేరుతో బృందావన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి బస కోసం ఓ హోటల్‌లో రెండు రూమ్‌లు అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మందిని ఓ గదిలో ఉంచగా, 11వ తరగతి చదివే ఓ విద్యార్థినిని మాత్రం తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. బాలికి మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అయితే, ఆ బాలిక ప్రతిఘటించడంతో చంపేస్తానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. టూర్ ముగించుకుని గత 24వ తేదీన ఇంటికి చేరుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments