Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేర చరితులే..

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (08:55 IST)
ఇటీవల గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మరోమారు అధికారాన్ని దక్కించుకుంది. తద్వారా వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్ శాసనసభలో ఒక్క బీజేపీ మాత్రమే ఏకంగా 156 సీట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 చోట్ల విజయం సాధించారు.
 
అయితే, కొత్త అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుల్లో ఏకంగా 40 మంది నేరచరితులే కావడం గమనార్హం. వీరిలో 20 మంది తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. బీజేపీ తరపున ఎన్నికైన 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది, 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 9 మంది, ఐదుగురు ఆప్ శాసనసభ్యుల్లో ఇద్దరిపై ఈ తరహా తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. 
 
ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు సమర్పించిన వివరాల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. నేరచరిత్ర కలిగిన 40 మందిలో 29 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉండగా, కొందరిపై అత్యాచారం, హత్య కేసు కూడా ఉండటం గమనార్హం. అయితే, గత 2017లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఇపుడు కొంతమేరకు తగ్గింది. గతంలో 47 మంది నేరచరితులు అసెంబ్లీకి ఎన్నికకాగా, ఇపుడు ఈ సంఖ్య 40కి తగ్గినట్టు ఏడీఆర్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments