కన్నతండ్రిని కడతేర్చి.. ఇంటిలోనే పాతిపెట్టిన కుమారులు.. 30 యేళ్ల తర్వాత...

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (11:02 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులు కన్నతండ్రిని కడతేర్చారు. శవాన్ని బయటకు తీసుకెళితే అందరికీ తెలిసిపోతుందని భావించిన ఆ కిరాతక తనయులు.. తమ ఇంటిలోనే పాతిపెట్టారు. ఈ విషయం ఇపుడు వెలుగులోకి రావడంతో 30 యేళ్ల తర్వాత అస్థిపంజరంను వెలికి తీశారు. మూడో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హాథ్రాస్‌కు చెందిన బుధ్‌ సింగ్‌ 1994 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై అతడి కుమారుడు పంజాబీ సింగ్‌ ఇటీవల స్థానిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన ఇద్దరు సోదరులు మరో వ్యక్తితో కలిసి తండ్రిని చంపి ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టారని ఆరోపించాడు. అప్పుడు తన వయసు తొమ్మిదేళ్లు అని చెప్పాడు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఆ ఇంట్లో తవ్వకాలు చేపట్టగా ఓ అస్థిపంజరం లభ్యమైంది. దానికి పోస్టుమార్టంతోపాటు డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు.
 
అయితే వ్యవసాయం చేసుకునే బుధ్‌ సింగ్‌కు నలుగురు కుమారులు. సోదరుల మధ్య ఇటీవల గొడవలు వచ్చాయి. మూడు దశబ్దాల క్రితం తండ్రికి, తన అన్నయ్యలకు మధ్య జరిగిన గొడవ విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాలు మాట్లాడటం వల్ల ఆ ఇద్దరు సోదరులు పంజాబీ సింగ్‌ను బెదిరించారు. దీంతో వారిపై సింగ్​కు అనుమానం వచ్చింది. తండ్రి అదృశ్యమవడానికి వారే కారణమని భావించాడు. వెంటనే ఇద్దరు సోదరులపై ఫిర్యాదు చేయడంతో డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments