Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరి కూలీల ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (12:41 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ విషాదం జరిగింది. ఇద్దరు కూలీలు సెప్టెక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ట్యాంకు నుంచి విష వాయువు సోకడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక కొండపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ ఉంది. దీన్ని శుభ్రం చేసేందుకు భవన యజమాని ఇద్దరు కూలీలను మాట్లాడుకున్నారు. వారిద్దరూ ఆదివారం వచ్చి ట్యాంకును క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. 
 
అయితే, ట్యాంకులో విషవాయు సోకడంతో పాటు.. ఊపిరాడక వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ బృందం అక్కడకు చేరుకుని ట్యాంకులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు. 
 
మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం, ఘాజీనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కుటుంబాలతో కలిసి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments