శ్రీహరికోటలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో వీరిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉండే ఇస్రో అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ వచ్చిన ఈ ఇద్దరు జవాన్లు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని వికాస్ సింగ్ (33)గా గుర్తించారు. ఈయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
మరో జవాను పేరు చింతామణి (29). ఈ జవాన్ ఇస్రో కేంద్రంలోని ఒక చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వీరిద్దరూ తమతమ వ్యక్తిగత కారణాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ వచ్చిన వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరు : రజనీకాంత్

కానిస్టేబుల్ కనకం 3 ప్రతి సీజను బాహుబలి లాగా హిట్ అవుతుంది :కె. రాఘవేంద్రరావు

కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, మనమూ పోతాం: రేణు దేశాయ్

ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments