Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు : భార్య పటిషన్

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (17:17 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు రాజశేఖర్‌పై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. అందువల్ల తన భర్తకు పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌ రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసు శాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందన్నారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు.. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం సూచించింది.
 
మరోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉస్మానియా జేఏసీ ఆందోళనకు దిగింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో) పరీక్ష కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన ఈ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. సీడీపీవో పేపర్‌ కూడా లీకేజీ అయ్యిందని ఓయూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments