Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను చంపేస్తామంటూ బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:31 IST)
ప్రయాణికులు లేని ఓ రైలు బోగీలో కన్నబిడ్డను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరు కామాంధులు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు బోగీ ఖాళీగా ఉండటంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ రోజే నిందితులను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శనివారం అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైలులో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ అస్సాం రాజధాని గౌహతి నుంచి బెంగాల్‌లోని అలీపూర్ ద్వార్‌కు వెళుతుండగా, ఓ మహిళ తన బిడ్డతో కలిసి శనివారం గౌహతి రైల్వే స్టేషన్‌లో ఎక్కింది. ఈ రైలు ఫకీరాగ్రామ్ చేరుకునేసరికి బోగీలోని ప్రయాణికులు దాదాపుగా ఖాళీ అయిపోయారు. 
 
ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాం వాసులు అబు (25), మొయినుల్ హక్ (26)లు బాధిత మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహిళ బిడ్డను రైల్లో నుంచి తోసేస్తామంటూ ఆమెను బెదిరించి, కట్టేసి కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రైలు అలీపూర్‌ద్వార్ జంక్షన్‌కు చేరుకున్నాక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, తక్షణం స్పందించిన పోలీసులు శనివారం రాత్రే ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments