Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మహిళతో హనీట్రాప్.. న్యూడ్ కాల్.. ఆపై సన్నిహితంగా... : సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:18 IST)
సీఐఎస్ఎఫ్‌లో పని చేసే ఓ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డారు. పాకిస్తాన్ మహిళతో హనీట్రాప్ కేసులో చిక్కుకున్నాడు. దీంతో హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బదిలీ అయ్యాడు. ఇపుడు పోలీసుల చేతికి చిక్కి జైలుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన కపిల్ కుమార్ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గత యేడాది ఆగస్టు 22వ తేదీన హైదరాబాద్ నగరంలోని భారత డైనమిక్స్ లిమిటెడ్‌ నుంచి విశాఖలోని స్టీల్ ప్లాంట్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ ఫైర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఫేస్‌బుక్‌లో తమీషా అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం మరింత పెరిగి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని భానూరులో ఓ గదిలో రహస్యంగా కలుసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
కాగా, తమీషా ఓ ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడి వద్ద పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కపిల్ కుమార్ నుంచి భారత డైనమిక్స్, స్టీల్ ప్లాంట్‌కు చెందిన రహస్య సమాచారాన్ని ఆమె గత రెండేళ్లుగా అతడి నుంచి సేకరిస్తున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఒక నంబరు నుంచి తరచుగా పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్ వెళుతున్నట్టు పసిగట్టిన నిఘా సంస్థలు పోలీసులకు ఉప్పందించాయి. దాంతో వారు కపిల్ కుమార్ ఫోనును స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వద్ద నుంచి మూడు ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments