Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలకు హెల్మెట్లు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎంతో పురోగతి సాధించామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. తమది దేశంలోనే ధనిక రాష్ట్రమంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అనేక ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుని, అవి ఎపుడు కూలుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా స్లాబు పెచ్చులూడిపడుతుండంటతో అక్కడ పని చేసే ఉద్యోగులు తలకు హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో ఈ దృశ్యం కనిపించింది. 
 
ఈ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఇక్కడ పని చేసే ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండటంతో ఆ పెచ్చులు నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరువుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని పని చేస్తున్నారు. 
 
కాగా, గత 2016లో ఈ మండలం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో యేడాది నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. గత యేడాది ఎంపీడీవో మల్లారెడ్డి కూర్చొనివుండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. 
 
ఈ విషయం ఉన్నాతాధికారుల దృష్టికి వెళ్ళడంతో అప్పటి అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ, ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో ఎపుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతూ, ఇక్కడ పని చేసే ఉద్యోగులు ఇలా తలకు ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments