Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అమ్మవారి అంశనంటూ సోదరి తల నరేకిసిన బాలిక, పరుగులు తీసిన స్థానికులు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:19 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తను అమ్మవారి అంశనంటూ దేవత విగ్రహం వద్ద వున్న కత్తిని తీసుకుని ఇంట్లో నిద్రిస్తున్న తన సోదరి తలను నరికేసిన దారుణ ఘటన జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని డూంగర్‌పూర్ పరిధిలో జింజ్వాఫాలా గ్రామానికి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. కాసేపటికి శంకర్ పెద్దకుమార్తె వింతగా ప్రవర్తిస్తూ తను అమ్మవారి అంశనంటూ దేవతా విగ్రహం వద్దనున్న కత్తిని తీసుకుంది. ఆ కత్తితో పూజలు చేస్తున్నవారిపైకి వచ్చింది.

 
ఆమెను వారించేందుకు తండ్రి, ఆమె పెదనాన్న ప్రయత్నించగా కత్తితో వారిని తీవ్రంగా గాయపరిచింది. దీనితో భయభ్రాంతులకు గురైన అక్కడివారు బయటకు పరుగులు తీసారు. కత్తి పట్టుకున్న ఆ బాలిక ఇంట్లో బీభత్సం సృష్టించింది. చివరికి గదిలో నిద్రిస్తున్న తన సోదరి తలను కత్తితో నరికేసింది. ఆ ఘటనతో అంతా షాక్ తిన్నారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments