Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల నర్సు మృతదేహం, అఘాయిత్యం చేసి హత్య చేసారేమో?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌ భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. యువతిది హత్యేమోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి చేతిపై సూదితో పొడిచినట్లు కొన్ని సూది గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
 
తన సోదరి దీపికా ప్రజాపతి (22) ఖాండ్వా నివాసి అని మృతురాలి సోదరుడు నితిన్ ప్రజాపతి చెప్పారు. ఆమె ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, శనివారం రాత్రి షిఫ్ట్ ఉంది, రాత్రి షిఫ్ట్ తర్వాత ఆమె తన తాత్కాలిక ఇంటికి తేజాజీ నగర్‌కు తిరిగి వెళ్లాల్సి వుంది. ఐతే ఆ సమయంలో ఆమె భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకు దిగిందో తమకు అర్థం కావడంలేదన్నారు. తమ సోదరిని ఎవరో హత్య చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేసాడు.
 
ఈ సంఘటనకు సంబంధించి, డిసిపి సింగ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. యువతి చేతిపై కొన్ని సూది గుర్తులు కనిపించాయనీ, శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడించగలమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments