Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల నర్సు మృతదేహం, అఘాయిత్యం చేసి హత్య చేసారేమో?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌ భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. యువతిది హత్యేమోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి చేతిపై సూదితో పొడిచినట్లు కొన్ని సూది గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
 
తన సోదరి దీపికా ప్రజాపతి (22) ఖాండ్వా నివాసి అని మృతురాలి సోదరుడు నితిన్ ప్రజాపతి చెప్పారు. ఆమె ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, శనివారం రాత్రి షిఫ్ట్ ఉంది, రాత్రి షిఫ్ట్ తర్వాత ఆమె తన తాత్కాలిక ఇంటికి తేజాజీ నగర్‌కు తిరిగి వెళ్లాల్సి వుంది. ఐతే ఆ సమయంలో ఆమె భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకు దిగిందో తమకు అర్థం కావడంలేదన్నారు. తమ సోదరిని ఎవరో హత్య చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేసాడు.
 
ఈ సంఘటనకు సంబంధించి, డిసిపి సింగ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. యువతి చేతిపై కొన్ని సూది గుర్తులు కనిపించాయనీ, శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడించగలమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments