Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల నర్సు మృతదేహం, అఘాయిత్యం చేసి హత్య చేసారేమో?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్‌ భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. యువతిది హత్యేమోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి చేతిపై సూదితో పొడిచినట్లు కొన్ని సూది గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
 
తన సోదరి దీపికా ప్రజాపతి (22) ఖాండ్వా నివాసి అని మృతురాలి సోదరుడు నితిన్ ప్రజాపతి చెప్పారు. ఆమె ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, శనివారం రాత్రి షిఫ్ట్ ఉంది, రాత్రి షిఫ్ట్ తర్వాత ఆమె తన తాత్కాలిక ఇంటికి తేజాజీ నగర్‌కు తిరిగి వెళ్లాల్సి వుంది. ఐతే ఆ సమయంలో ఆమె భన్వర్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకు దిగిందో తమకు అర్థం కావడంలేదన్నారు. తమ సోదరిని ఎవరో హత్య చేసి వుంటారని అనుమానం వ్యక్తం చేసాడు.
 
ఈ సంఘటనకు సంబంధించి, డిసిపి సింగ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. యువతి చేతిపై కొన్ని సూది గుర్తులు కనిపించాయనీ, శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడించగలమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments