Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిళకు ఊరట కలిగించిన తెలంగాణ హైకోర్టు

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (14:16 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులపై చేయి చేసుకున్న కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న షరతు విధించింది. అలాగే రెండు ష్యూరిటీలు, రూ.30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 
 
కాగా, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సోమవారం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేసమయంలో ఆమె బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారమే వాదనలు పూర్తి చేసినప్పటికీ తీర్పును మాత్రం మంగళవారం వెలువరించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
అయితే, పోలీసులపై షర్మళ చేయి చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పేర్కొన్నారు. షర్మిళ తరపు న్యాయవాదులు వాదిస్తూ ఆమెను పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతిస్పందించారని చెప్పారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన కోర్టు షర్మిళకు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments