Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తను చంపేసిన అల్లుడు.... మంచిర్యాలలో దారుణం (Video)

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (08:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన అత్త పట్ల అల్లుడు కిరాతకంగా ప్రవర్తించాడు. తమ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణం మంచిర్యాల, సున్నంబట్టివాడలో జరిగింది.  ఈ ప్రాంతానికి చెందిన నెల్లి విజయ అనే మహిళ కుమార్తె మాళవికను.. మంచిర్యాల పట్టణానికి చెందిన సాత్రం వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అత్త (విజయకు), అల్లుడు (వెంకటేశ్‌కు)కు మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ సంసారంలో చిచ్చుపెట్టిందన్న ఆగ్రహించిన విజయ్.. అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్ ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత వెంకటేశ్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, తను ప్రాణాపాయం నుంచి బయటపడగా, విజయ మాత్రం చనిపోయింది. స్థానిక పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments