Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తను చంపేసిన అల్లుడు.... మంచిర్యాలలో దారుణం (Video)

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (08:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన అత్త పట్ల అల్లుడు కిరాతకంగా ప్రవర్తించాడు. తమ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణం మంచిర్యాల, సున్నంబట్టివాడలో జరిగింది.  ఈ ప్రాంతానికి చెందిన నెల్లి విజయ అనే మహిళ కుమార్తె మాళవికను.. మంచిర్యాల పట్టణానికి చెందిన సాత్రం వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అత్త (విజయకు), అల్లుడు (వెంకటేశ్‌కు)కు మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ సంసారంలో చిచ్చుపెట్టిందన్న ఆగ్రహించిన విజయ్.. అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్ ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత వెంకటేశ్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, తను ప్రాణాపాయం నుంచి బయటపడగా, విజయ మాత్రం చనిపోయింది. స్థానిక పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments