Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై మోహం .. భార్య - అత్త - అమ్మమ్మలపై ఉన్మాది కత్తితో దాడి

Telangana
Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (19:14 IST)
సభ్య సమాజంలో అపుడపుడూ అక్కడక్కడా కొన్ని సంఘటనలు తలదించుకునేలా ఉంటున్నాయి. ఓ వివాహితుడు తనకు మరదలి వరుసయ్యే భార్య చెల్లిపై వ్యామోహం పెంచుకున్నాడు. ఒకవైపు భార్యతో కాపురం చేస్తూనే మరోవైపు మరదలితో పడక సుఖానికి తహతహలాడాడు. ఈ విషయం తెలిసి మందలించిన భార్యతో అత్తపై కత్తితోదాడి చేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు మరదలిపై మనసు పారేసుకున్నాడు. ఆమెపై రోజురోజుకూ వ్యామోహం పెంచుకోసాగాడు. ఈ విషయాన్ని గ్రహించిన భార్య భర్తను మందలించి,  విషయాన్ని తన తల్లి, అమ్మమ్మకు చెప్పింది. 
 
అంతే.. ఒక్కసారిగా అగ్రహోద్రుక్తుడైన ఆ ఉన్మాది కత్తితో భార్య, అత్త, అమ్మమ్మపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments