Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూసేందుకు వచ్చిన 17 యేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో కామాంధుడు చేతిలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. బాధితురాలి వయసు 17 యేళ్లుకాగా, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి వయసు 65 యేళ్లు. ఈ దారుణం మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 17 యేళ్ల బాలిక తన ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన సమయంలో 65 యేళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికాగా వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారంచారు. 
 
అనంతరం బాలిక తల్లి తండ్రులు నిజాంపేట పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments