Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించి... శివసేన యూబీటీ నేత కాల్చివేత.. నిందితుడు కూడా...

ఠాగూర్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (10:17 IST)
లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించిన శివసేన పార్టీకి చెందిన యూటీబీ నేతను కాల్చివేశారు. ఆ తర్వాత నిందితుడు కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని దహిసార్ ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని అభిషేక్‌గా ఘోసాల్కర్‌గా గుర్తించారు. ఈయన మహారాష్ట్ర శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ కీలక నేత కుమారుడు కావడం గమనార్హం. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించి నిందితుడు మారిస్ నోరాన్హా. అభిషేక్‌ను తుపాకీతో కాల్చిన నోరాన్స్.. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ముంబై దహిసార్ ప్రాంతంలోని ఎం.హెచ్.బి. పోలీస్స స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్‌ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతనికి విభేదాలు ఉండగా, ఇటీవలే వాటిని పరిష్కరించుకుని రాజీకి వచ్చారు. ఆ తర్వాత లైవ్ స్ట్రీమింగ్‌కు అభిషేక్‌ను ఆహ్వానించిన మారిస్.. ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. కాగా, ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరిచిపోకముందే ఇపుడు మరో హత్య జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments