Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించి... శివసేన యూబీటీ నేత కాల్చివేత.. నిందితుడు కూడా...

ఠాగూర్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (10:17 IST)
లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించిన శివసేన పార్టీకి చెందిన యూటీబీ నేతను కాల్చివేశారు. ఆ తర్వాత నిందితుడు కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని దహిసార్ ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని అభిషేక్‌గా ఘోసాల్కర్‌గా గుర్తించారు. ఈయన మహారాష్ట్ర శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ కీలక నేత కుమారుడు కావడం గమనార్హం. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించి నిందితుడు మారిస్ నోరాన్హా. అభిషేక్‌ను తుపాకీతో కాల్చిన నోరాన్స్.. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ముంబై దహిసార్ ప్రాంతంలోని ఎం.హెచ్.బి. పోలీస్స స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్‌ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతనికి విభేదాలు ఉండగా, ఇటీవలే వాటిని పరిష్కరించుకుని రాజీకి వచ్చారు. ఆ తర్వాత లైవ్ స్ట్రీమింగ్‌కు అభిషేక్‌ను ఆహ్వానించిన మారిస్.. ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. కాగా, ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరిచిపోకముందే ఇపుడు మరో హత్య జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments