Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించి... శివసేన యూబీటీ నేత కాల్చివేత.. నిందితుడు కూడా...

ఠాగూర్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (10:17 IST)
లైవ్ స్ట్రీమింగ్‌కు ఆహ్వానించిన శివసేన పార్టీకి చెందిన యూటీబీ నేతను కాల్చివేశారు. ఆ తర్వాత నిందితుడు కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని దహిసార్ ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని అభిషేక్‌గా ఘోసాల్కర్‌గా గుర్తించారు. ఈయన మహారాష్ట్ర శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ కీలక నేత కుమారుడు కావడం గమనార్హం. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించి నిందితుడు మారిస్ నోరాన్హా. అభిషేక్‌ను తుపాకీతో కాల్చిన నోరాన్స్.. ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ముంబై దహిసార్ ప్రాంతంలోని ఎం.హెచ్.బి. పోలీస్స స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్‌ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతనికి విభేదాలు ఉండగా, ఇటీవలే వాటిని పరిష్కరించుకుని రాజీకి వచ్చారు. ఆ తర్వాత లైవ్ స్ట్రీమింగ్‌కు అభిషేక్‌ను ఆహ్వానించిన మారిస్.. ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. కాగా, ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరిచిపోకముందే ఇపుడు మరో హత్య జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments