Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. చివరకు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (13:57 IST)
పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేసిన బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన ఓ తల్లి కథ చివరకు విషాదాంతంగా ముగిసింది. కాలు జారడంతో ఆమె మెడకు వేసుకున్న ఉరి కాస్త బిగుసుకుంది. దీంతో ఆ ఆమె కన్నబిడ్డ ముందే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాయి అనే దంపతులు ఉన్నారు. వీరికి 16, 14 వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇంటికి సమీపంలో ఉండే పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, ఒక కుమారుడు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. ఇది గత కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో కొడుకును దారికి తెచ్చుకునేందుకు యమునాబాయి... స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించింది. 
 
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాయి గొంతుకు ఉరితాడు బిగించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా, ఆమె కాలు జారింది. దీంతో మెడకు ఉరితాడు బిగుసుకుంది. కొడుకు పరుగెత్తుకుంటూ వెళ్లి చుట్టుపక్కల వారిని పిలుచుకుని వచ్చేలోపు యమునాబాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments