Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. చివరకు...

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (13:57 IST)
పాఠశాలకు వెళ్లనంటూ మారాం చేసిన బిడ్డను దారికి తెచ్చుకునేందుకు ఉరేసుకుంటానని బెదిరించిన ఓ తల్లి కథ చివరకు విషాదాంతంగా ముగిసింది. కాలు జారడంతో ఆమె మెడకు వేసుకున్న ఉరి కాస్త బిగుసుకుంది. దీంతో ఆ ఆమె కన్నబిడ్డ ముందే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాయి అనే దంపతులు ఉన్నారు. వీరికి 16, 14 వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇంటికి సమీపంలో ఉండే పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, ఒక కుమారుడు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. ఇది గత కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో కొడుకును దారికి తెచ్చుకునేందుకు యమునాబాయి... స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించింది. 
 
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాయి గొంతుకు ఉరితాడు బిగించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా, ఆమె కాలు జారింది. దీంతో మెడకు ఉరితాడు బిగుసుకుంది. కొడుకు పరుగెత్తుకుంటూ వెళ్లి చుట్టుపక్కల వారిని పిలుచుకుని వచ్చేలోపు యమునాబాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments