Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల కళ్లకు గంతలు కట్టి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసిన ఉపాధ్యాయుడు....

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (09:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఓ కీచక ఉపాధ్యాయుడు వెలుగులోకి వచ్చాడు. తన వద్ద చదువుకునే ఇద్దరు బాలికలకు కళ్లకు గంతలు కట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడింది కూడా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావడం గమనార్హం. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. 
 
ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న అనిల్‌ నాలుగు రోజుల కిందట ఇద్దరు బాలికల కళ్లకు గంతలు కట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దీంతో సదరు బాలికలు బడికి వెళ్లడం మానేశారు. విద్యార్థినులను తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. 
 
దీంతో ఆగ్రహించిన వారు గ్రామస్థులతో కలిసి గురువారం అనిల్‌ని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గ్రామస్థులు ఆయనపై దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థినుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గతంలోనూ అనిల్‌ ఇలాంటి పనులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం