Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్టీ విద్యార్థిని కిడ్నాప్ చేసి చంపేశారు.. ఏలూరులో దారుణం!

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దళిత విద్యార్థి హత్యకు గురయ్యాడు. హాస్టల్‌లో ఉంటూ చదవుకుంటూ వచ్చిన ఈ బాలుడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అతి క్రూరంగా చంపేశారు. అర్థరాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి హాస్టల్‌లోకి చొరబడిన దుండగులు ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి పాఠశాల ఆవరణలో పడేశారు. బతకాలని అనుకున్నవారు వెళ్లాపోవాలని, లేదంటే ఇలాంటి సీన్లు రిపీట్ అవుతాయంటూ దండగులు ఓ లేఖ రాశారు. 
 
ఏలూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో జరిగిన అత్యంత దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. మన్యంలోని కుగ్రామమైన ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి వలంటీరు. ఆయన భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్త. వీరి ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఆరో తరగతి, చిన్నవాడైన అఖిలవర్థన్ రెడ్డి (9) నాలుగో తరగతి చదువుతున్నారు.
 
సోమవారం అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విద్యుత్ సరఫరా నిలిపివేసి అఖిలవర్ధన్ రెడ్డిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం హత్య చేసి సమీపంలోని గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. 'బతకాలనుకున్నవారు వెళ్లిపోండి. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతుంటాయి.. ఇట్లు.. ' అని రాసి వున్న లేఖను బాలుడి చేతిలో పెట్టి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు పాఠశాల హెడ్మాస్టర్, వార్డెన్, వాచ్‌మెన్‌లను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments