Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో భార్యను తుపాకీతో కాల్చిన భర్త.. చివరకు...

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:30 IST)
అనుమానం పెనుభూతమైంది. దీనికితోడు పీకలవరకు మద్యం సేవించాడు. ఈ మైకంలో ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. అంతే.. నాటు తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో భార్య చనిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరణికోట కాలనీకి చెందిన జగ్గరావు, సవర పద్మ(33) అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యపై అనుమానంతో జగ్గారావు లోలోన కుమిలిపోతున్నాడు. దీంతో ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో మద్యం తాగొచ్చి రోజూ వేధింపులకు పాల్పడతుండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్దనున్న నాటు తుపాకీతో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
 
కాగా గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments