Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడు నరికివేత

Webdunia
సోమవారం, 2 మే 2022 (10:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో నలుగురు మహిళలపై అత్యాచారం జరిగింది. ముఖ్యంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో పొట్టచేతపట్టుకుని వచ్చిన ఓ వలసకూలీ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారం జరిపారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. తాజాగా కాకినాడి జిల్లా సామర్లకోటలో పట్టపగలు, నడిరోడ్డుపై ఓ యువకుడిని నరికి చంపేశారు. అదీకూడా అందరూ చూస్తుండగా సాటి స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక భాస్కర్ నగరులో నివసిస్తున్న తలాటి శివ (28) అనే వ్యక్తి తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో నరాల మణికంఠ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, వీరి మధ్య వివాదం తలెత్తడంతో అక్కడ నుంచి వచ్చేసి సోదరుడితో కలిసి భాస్కర్ నగరులో ఉంటున్నాడు. 
 
అయితే, శివపై ప్రతీకారం తీర్చుకోవాలని రగలిపోతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం పుట్టినరోజు కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన మణికఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడి చేశాడు. 
 
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments