Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి జైలుపాలైన ప్రొఫెసర్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:44 IST)
తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదన్న కోపంతో ఓ విద్యార్థినిని ప్రొఫెసర్ ఒకరు ఫెయిల్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీలో బాధితురాలు చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసే ఓ గిరిశ్ పర్మార్ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. దీంతో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. 
 
దీనికి ఆమె అంగీకరించలేదు. అర్పిత్ అగర్వాల్ అనే విద్యార్థి ద్వారా కూడా ఒత్తిడి తెచ్చాడు. అప్పటికీ ఆమె లొంగలేదు. దీంతో ఆ విద్యార్థిని తాను బెదిరించినట్టుగానే పరీక్షల్లో ఫెయిల్ చేశాడు. 
 
తాను పరీక్షల్లో ఫెయిల్ కావడంతో షాక్‌కు గురైన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో... ఈ విద్యార్థినినే కాకుండా మరికొందరు విద్యార్థినిలను కూడా బెదిరించినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం